పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే బొగ్గు కుంభకోణం వ్యవహారంలో ప్రధాన మంత్రి రాజీనామా చేయాలని విపక్షలు పట్టుబట్టాయి. అందులో భాగంగా సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే రాజ్యసభలో కూడా ఇదే రీతిలో విపక్షాలు ఆందోళన చేపట్టడంతో చైర్మన్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.