‘తెలుగు వాళ్లందరికీపండుగ రోజు’
న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆయన అభిమానులకే కాకుండా తెలుగువాళ్లందరికీ పండుగ రోజు అని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగిందని ఆమె మంగళవారమిక్కడ తెలిపారు. తాను కుటుంబ సభ్యలందరినీ పలకరించినట్లు లక్ష్మి పార్వతి చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహ రూపంలో అందర్నీ ఆశీర్వదించారని ఆమె అన్నారు.