ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. సమావేశంలో రైల్వే మంత్రి బన్సల్‌ అవినీతి వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. ఆయన మేనల్లుడు విజయ్‌సింగ్లా ఓ రైల్వే ఉన్నతాధికారి నుంచి రూ.90 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బన్సల్‌ తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.