ప్రధాని రాజీనామాకు లోక్సభలో విపక్షాల పట్టు
న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణంపై లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళన మధ్యే ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.