ప్రధాని రాజీనామాకు లోక్‌సభలో విపక్షాల పట్టు

న్యూఢిల్లీ : లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై భాజపాతోపాటు ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగి ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని యూపీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళనల మధ్యే సభా కార్యక్రమాలను స్పీకర్‌ నిర్వహిస్తున్నారు.