బొగ్గు కుంభకోణంపై విచారణ మే 8కి వాయిదా

న్యూఃఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై విచారణను సుప్రీంకోర్టు మే 8కి వాయిదా వేసింది. ఏ నిబంధనల మేరకు దర్యాప్తు నివేదిక వివరాలు చెప్పారో తెలపాలని సీబీఐ డైరెక్టర్‌ను కోర్టు అదేశించింది. ప్రభుత్వానికి నివేదిక విషయాలు తెలిపిన అంశంపై మే 6లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు బృందం వివరాలు కావాలని కోర్టు సీబీఐని అడిగింది.