ముంబయిలో మెట్రో రైలు పరుగులు
ముంబయి : ముంబయిలో బుధవారం మెట్రో రైలు పరుగులు తీసింది. ప్రయోగాత్మకంగా నిర్వహంచిన ప్రయాణంలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్, సీనియర్ మంత్రిలు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 కిలో మీటర్ల మార్గంలో దాదాపు మూడు కిలో మీటర్ల మార్గం పూర్తియింది. వెర్నోవా నుంచి ఘట్కోపర్ ఆజాద్ నగర్ వరకూ ప్రస్తుతం మెట్రో రైలు నడవనుంది. మిగిలిన మార్గాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు సన్నాహలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2008 లో ప్రారంభమైన ఈ పనులు డిసెంబర్ 2010 నాటికి పూర్తి కావల్సి ఉంది.