రాష్ట్రపతితో భేటీకానున్న ఎల్‌కే అద్వానీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ భేటీ అయ్యారు. అద్వానీతోపాటు పలువురు ఎన్డీఏ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. చైనా దురాక్రమణ, పాకిస్థాన్‌లో భారత ఖైదీ సరబ్‌సింగ్‌ మృతిపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ వారు రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. దానికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని సమాచారం.