రేపు కర్ణాటక విధానసభ ఎన్నికలు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా 35 మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. మే 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.