లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభంకాగానే 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దీంతో సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు.