లోక్‌సభ స్పీకర్‌ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకోవద్దని నేతలను కోరారు. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ విపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నారు. పార్లమెంట్‌లో ఆందోళనలు విరమించుకోవాలని కోరనున్నారు.