సత్యాగ్రహ దీక్షకు హాజరైన భాజపా, తెరాస నేతలు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐకాస ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు భాజపా, తెరాస, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఐకాస అధ్యక్షుడు కోదండరాంతోపాటు భాజపా జాతీయ నేత ప్రకాశ్‌ జవదేకర్‌, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి తదతరులు దీక్షలో పాల్గొన్నారు.