షిర్డి సంస్థాన్‌కు నూతన ట్రస్టు ఏర్పాటు చేయండి

ముంబయి : సాయినాధుని సన్నిధానమైన షిర్డి సాయి సంస్థాన్‌ పాలనా వ్యవహరాలు నిర్వహించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. 2012 మార్చి 30 నుంచి ట్రస్టు కార్యకలాపాల నిమిత్తం తాత్కాలిక బోర్డును న్యాయస్థానం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కొత్త ట్రస్టు పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం పాత బోర్డు రద్దవుతుందని న్యాయస్థానం పేర్కొంది.