సమాచారం అందించటమే కానీ కేంద్రం చర్యలు తీసుకోదా? : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ ఘటనపై షిండే ప్రకటన సాదాసీదాగా ఉందనిలోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ మండిపడ్డారు. మూడు రోజులల ముందే కేంద్రం సమాచారం అందించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు అప్రమత్తం కాలేదని ఆమె ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని డిమాండ్‌ చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన స్థానిక నాయకులు ప్రభావం పేలుళ్ల ఘటనపై ఉందా అని ప్రశ్నించారు. దాడుల సమాచారాన్ని రాష్ట్రానికి చెప్పడమే తప్ప కేంద్రం చర్యలకు ఉపక్రమించదా అని అన్నారు. హైదరాబాద్‌ పేలుళ్లఘటనపై చర్చకు విపక్షాలు పట్టుపట్టడంతో లోక్‌సభ మధ్యాహ్నం 3.30లకు వాయిదా పడింది.