సరబ్జిత్ను ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు భావిస్తున్నాం: మనీష్
ఢిల్లీ : సరబ్జిత్ సింగ్ది కుట్రపూరిత హత్యగానే పరిగణిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు భావిస్తున్నామని కేంద్ర మంత్రి మనీష్ తివారీ అన్నారు. సరబ్పట్ల పాక్ వైఖరి అమానవీయమని ఆయన పేర్కొన్నారు. సరబ్ వ్యవహరించే తీరులో పాకిస్థాన్ వైఖరి సరిగా లేదన్నారు. జెనీవా ఒప్పందాలను పాకిస్థాన్ ఉల్లంఘించినట్లు అర్థమవుతోందన్నారు. సరబ్జిత్ మృతదేహాన్ని భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ను కోరామన్నారు. సరబ్జిత్ వ్యవహారాన్ని రాజకీయ చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తివారీ అరోపించారు.