సరబ్జిత్ మృతదేహాన్ని రప్పించేందుకు చర్యలు: ప్రధాని
న్యూఢిల్లీ : పాకిస్థాన్లో మృతిచెందిన సరబ్జిత్ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తెలిపారు. సరబ్జిత్ మృతికి కారణమైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.