సివిల్స్ మెయిన్స్-2012 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2012 ఫలితాలను ఇవాళ యూపీఎస్సీ విడుదల చేసింది. అఖిల భారత సర్వీసులకు 998 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. జనరల్ కేటగిరిలో 457, ఓబీసీ కేటగిరిలో 295, ఎస్సీ కేటగిరిలో 169, ఎస్టీ కేటగిరిలో 77 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. హైదరాబాద్కు చెందిన కె. విశ్వజిత్కు 205 వ ర్యాంకు వచ్చింది. మరో అభ్యర్థి రాజేంద్రకుమార్కు 516 వ ర్యాంకు వచ్చింది.