5.30 గంటలకు భేటీకానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు సభ్యులు సమావేశమై పలు కీలక అంశాపై చర్చించనున్నారు. అయితే, రైల్వే మంత్రి బన్సాల్ అవినీతి వ్యవహారంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లా ఓ రైల్వే ఉన్నతాధికారి నుంచి రూ. 90 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే.