తెలంగాణ మంత్రుల దద్దమ్మలు : కేకే

హైదరాబాద్‌: తెలంగాణ కు ఒక్కపైసా కూడా ఇవ్వనని సీమాంధ్ర సీఎం కిరణ్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా స్పందించని దద్దమ్మలు తెలంగాణ మంత్రులు అని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌కే కేశవరావు అన్నారు. ఇవాళ ఆయన అంబేత్కర్‌ కాలేజీలో జరిగిన తెలంగాణ వియోచన దినోత్సవంలో మాట్లడారు. హైదరాబాద్‌లో అన్ని వ్యాపారాలు సీమాంధ్రుల చేతుల్లో కేంద్రీకృతమైనాయని ఆరోపించారు. షాపింగ్‌ మాల్స్‌, అపార్ట్‌ మెంట్లు అన్ని సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు.