అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి మృతి

నాగ్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందింది. నాగ్‌పూర్‌లోని ఐసీయూలో ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడి చిన్నారి నిన్న సాయంత్రం చనిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఘన్‌సోర్‌ పట్టణానికి చెందిన బాలికను ఏప్రిల్‌ 17న ఫిరోజ్‌ఖాన్‌ అనే 35 ఏళ్ల వ్యక్తి చాక్లెట్లు ఇస్తానని పిలిచి అత్యాచారానికి పాల్పడి అనంతరం పొలాల్లో వదిలేసి పరారయ్యాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు బాలికను గుర్తించి జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి నిన్న సాయంత్రం మృతి చెందిందని వైద్యులు తెలిపారు.