ఏ విషయంలోనైనా ఒకరిద్దరు విభేదిస్తూనే ఉంటారు: కొండ్రు

హైదరాబాద్‌ : బంగారు తల్లి పథకంపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారని, ఏ విషయంలోనైనా ఒకరిద్దరు మంత్రులు విభేదిస్తూనే ఉంటారని కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. బయ్యారం గనుల కేటాయింపు విషయంలో రాజకీయ రాద్ధాంతం అనవసరమని మంత్రి కొండ్రుమురళి అన్నారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయించినప్పుడు కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.