కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై విచారణ జూలైకి వాయిదా

ఢిల్లీ : కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్యే జనార్ధన్‌ రిజర్వేషన్‌పై తుది విచారణను సుప్రీంకోర్టు జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే జనార్ధన్‌ గిరిజనుడు కాదని, ఆయన  ఎన్నిక చెల్లదని గత అక్టోబరులో హైకోర్టు తీర్పు చెప్పింది.