డిసెంబర్లోగా మార్కెట్లోకి మ్యాగీ: నెస్లే
మ్యాగీ నూడుల్స్ను ఈ ఏడాది చివర్లోగా మళ్లీ దేశీయ మార్కెట్లోకి తీసుకువస్తామన్న ఆశాభావాన్ని నెస్లే ఇండియా ఎండి సురేశ్ నారాయణన్ పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మూడు స్వతంత్ర లాబొరేటరీల్లో మ్యాగీ శాంపిల్స్ పరీక్షలకు తాజాగా ఆదేశిస్తూనే ఫుడ్ రెగ్యులేటర్ల నిషేధాన్ని ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నెస్లే ఇండియా పైవిధంగా విశ్వాసం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఫుడ్ రెగ్యులేటర్ల నుంచి నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తారా? అన్న ప్రశ్నకు బదులుగా ముందు మార్కెట్లోకి తిరిగి మ్యాగీని తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యమన్నారు.