నారాయణన్‌ను నివాళి అర్పించిన వెంకయ్య

న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ స్మృత్యర్థం ట్విట్టర్‌ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్షరాంజలి ఘటించారు.  నారాయణన్‌ 99వ జయంతి సందర్భంగా వెంకయ్య ట్వీట్‌ చేశారు. నారాయణన్‌ విజన్‌ ఉన్న నాయకులని, గొప్ప అడ్మినిస్టేట్రర్‌ అని వెంకయ్య పేర్కొన్నారు. ఆయన నిరాడంబర జీవితం, బడుగుల జీవితాల్లో వెలుగుల కోసం పడ్డ తపన.. ఆయనను ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుందని తెలిపారు.