ప్రధాని రాజీనామాకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రధాని రాజీనామాకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీసకర్‌ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ కూడా విపక్షాల ఆందోళన మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడింది.