బండి సంజయ్‌కు అమిత్‌ షా ఫోన్‌

తాజా ఘటనలపై ఆరా తీసిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. సంజయ్‌ అరెస్టుతోపాటు సిద్ధిపేట ఘటనపై ఆయన ఆరా తీశారు. రఘునందన్‌ రావుకు మద్దతు తెలిపేందుకు దుబ్బాక వెళుతున్న సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌కు మద్దతుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.