బొగ్గుకుంభకోణంపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణంపై సుప్రీకోర్టులో విచారణ ప్రారంభమైంది. బొగ్గుకుంభకోణంపై సీబీఐ అఫిడవిట్‌ గందరగోళంగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి నివేదిక వివరాలు తెలపడంతో దర్యాప్తు ప్రక్రియ బలహీనమైందని వ్యాఖ్యా నించింది. దర్యాప్తు వివరాలు ప్రభుత్వానికి చెప్పినట్లు కోర్టుకు ఎందుకు తెలపలేదని ప్రశ్నించింది. రాజకీయ జోక్యం నుంచి సీబీఐకి విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. సీబీఐ సంస్థకు స్వయంప్రతిపత్తి పునరుద్దరించాల్సిందేనని వ్యాఖ్యానించింది.