ముంబయి విమానాశ్రయంలో రణ్‌బీర్‌ కపూర్‌ నిర్బంధం

ముంబయి : బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు నిర్బంధించారు. అప్రకటిత బ్రాండెడ్‌ వస్తువులను తనతోపాటు తీసుకొచ్చిన రణ్‌బీర్‌ను కస్టమ్స్‌ అధికారులు అడ్డుకుని రూ.60వేలు జరిమానా విధించారు. శనివారం మధ్యాహ్నం బ్రిటిష్‌ ఎయిర్వేస్‌ విమానంలో లండన్‌ నుంచి వచ్చిన రణ్‌బీర్‌ తనతోపాటు అప్రకటిత బ్రాండెడ్‌ వస్తువులను తీసుకొచ్చారని విశానాశ్రయ అధికారులు తెలిపారు. రణ్‌బీర్‌ను సుమారు 40 నిమిషాలపాటు అధికారులు నిర్బంధించారు.