వంద రోజుల్లో తెలంగాణ మద్దతిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ఇక ప్రజలు సహించరని భాజపా నేత ప్రకాశ్‌జవదేకర్‌ అన్నారు. ఐకాస ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే మద్దతిస్తామని ప్రకటించినా…కాంగ్రెస్‌ వెనకడుగ వేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.