23న టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం
హైదరాబాద్: ఈ నెల 23న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశానికి టీఆర్ఎస్ పోలిట్బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పది జిల్లాల అధ్యక్షులు హాజరు కానున్నారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.



