ఇంద్రకీలాద్రి ఈఈ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఈఈ) కార్యాలయంలో బుధవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సిబ్బంది. ఏసీ మిసన్ ఆపకుండా వెళ్లి పోవడంతో అర్థరాత్రి రెండు గంటల సమయంలో విద్యుత్ షాక్సర్క్యూట్ కారణంగా కార్యాలయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో దస్త్రాలు, టీవీ, ఫర్నిచర్ కాలిపోయాయి. ఈవో శ్రీనివాసరావు, ఈఈ కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.



