మార్కెట్లోకి సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్
మారుతి సుజుకి రూపొందించిన సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ కారును వరుణ్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా బేగంపేట్లోని వరుణ్ మోటార్స్లో ఆవిష్క రించారు. దీని ధర రూ. 8,61,217 నుంచి రూ.10,59,178గా నిర్ణయించారు. లీటరుకు 28.09 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, కొనుగోలుదార్ల నుంచి మంచి స్పందన వస్తోందని మారుతి సుజుకి ఎపి, టిఎస్ రీజినల్ మేనేజర్ మునీష్ బలి తెలిపారు.