జాతీయం
శోభా కరంద్లాజె ఓటమి
బెంగళూరు : మాజీ మంత్రి, కేజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజె అపజయం పాలయ్యారు. బెంగళూరు రాజాజీనగర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.
గాలి కరుణాకర్రెడ్డి ఓటమి
బెంగళూరు : భాజపా అభ్యర్థి గాలి కరుణాకర్రెడ్డి ఓటమిపాలయ్యారు. దావణగెరె జిల్లా హర్పనహళ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
ఆధిక్యంలో యడ్యూరప్ప
బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి, కేజీపీ అధ్యక్షుడు యడ్యూరప్ప శికారిపుర నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 8,492 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆట ముగిసింది : కమల్నాథ్
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో ఆట ముగిసిందని కేంద్రమంత్రి కమల్నాథ్ వ్యాఖ్యానించారు. భాజపా అసలు రంగును ప్రజలు గ్రహించి తిరస్కరించారని ఆయనన్నారు.
2 చోట్ల భాజపా గెలుపు
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాజపా రెండు స్థానాల్లో విజయం సాధించింది. మరో 37 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు.
సీఎం ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది : ఖార్గే
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేదీ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని కేంద్ర కార్మికమంత్రి మల్లికార్జునఖార్గే అన్నారు. అధిష్ఠానం సూచనల ప్రకారమే కాంగ్రెస్ శ్రేణులు నడుచుకొంటాయని ఆయన తెలిపారు.
తాజావార్తలు
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
- తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు
- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
- మరిన్ని వార్తలు